

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడో వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను తీసుకురావడం, యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పర్యటన ఉండనుంది. ఆగస్టు 18 నుంచి 20 మధ్య పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు, అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్కు సీఎం వెళ్లనున్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు సహా అధికారులు కూడా వెళ్లే అవకాశముంది. ఈ పర్యటనలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థలు, నైపుణ్య కేంద్రాలను సందర్శించి నిపుణులతో చర్చలు జరపనున్నారు.
తెలంగాణలో అభివృద్ధి అవకాశాల కోసం పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరిన్ని విశ్వవిద్యాలయాలను ఆహ్వానించే ప్రయత్నాలు జరుగనున్నాయి. నైపుణ్యాల విశ్వవిద్యాలయం అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం పై దృష్టి సారించనున్నారు. అలాగే ఒలింపిక్స్లో తెలంగాణ యువత పతకాలు సాధించేలా క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలను ఈ పర్యటనలో పరిశీలించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!