

రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరలేల ధర్మాసనం సోనమ్కు రెండు అవకాశాలు సూచించింది. కీలక సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు లొంగిపోవాలని ఆదేశించడం లేదా కేసులోని వాస్తవాలను పరిశీలించి తదుపరి ఉత్తర్వులు జారీ చేయడం అనే రెండు మార్గాలు తమ ముందున్నాయని కోర్టు పేర్కొంది. మేఘాలయ హైకోర్టు బెయిల్ను సమర్థించిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది.
ట్రయల్ కోర్టు విధించిన షరతుల ప్రకారం సోనమ్ షిల్లాంగ్లోనే ఉండి ప్రతిరోజూ విచారణకు హాజరవుతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాలకు న్యాయం జరిగేలా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2025 మేలో మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్త రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్పై ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు మంజూరైన బెయిల్ను మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!