
జనరల్

తిరుమలలోని అలిపిరి నడకదారిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురవడం తీవ్ర కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు సమీపంలోని భారీ ఆంజనేయస్వామి విగ్రహం కింద ప్రతిష్ఠించిన చిన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో అపహరించారు. ఈ విగ్రహానికి నిత్యపూజలు జరుగుతుండటంతో ఈ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!