

కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సువర్ణ అధ్యాయంగా పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాపై స్పష్టత ఇవ్వకుండా సంబరాలు చేసుకోవడం సరైనది కాదన్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కింద తెలంగాణకు కేటాయించిన 15.90 టీఎంసీల నీటి వాటాపై ఏవైనా స్పష్టమైన హామీలు సాధించారా అని ప్రశ్నించారు.
ఆర్డీఎస్కు సంబంధించిన సమస్యలు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాల చర్యలు, కొత్త ప్రాజెక్టుల ప్రభావం వంటి అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను రక్షించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా, కాలువల మరమ్మతులు, అక్రమ మళ్లింపుల నివారణ వంటి అంశాల్లో స్పష్టమైన ఫలితాలు లేకుండా జరిగిన సమావేశాన్ని సువర్ణ అధ్యాయంగా చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!