

రజినీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ తేదీకి సినిమా విడుదల అవుతుందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోయినా, చెన్నై సినీ వర్గాల్లో వాయిదా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మైత్రి సంస్థ ‘రణబాలి’ని అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ కూడా ఇదే సమయంలో విడుదలకు పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘జైలర్ 2’లోని కొన్ని సన్నివేశాలకు రీ-షూట్స్ అవసరమవుతున్నాయనే ప్రచారం వాయిదా చర్చలకు మరింత బలం చేకూరుస్తోంది. కథలోని కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించిన సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, సినిమా వ్యాపార ఒప్పందాలు ఇంకా పూర్తికాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హక్కులకు నిర్మాతలు భారీ మొత్తాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పూర్ణ ప్రత్యేక పాటకు మిశ్రమ స్పందన రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాల్సి ఉంది. చివరి దశ పనులు పూర్తయ్యాక సన్ పిక్చర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడే విడుదల తేదీపై స్పష్టత రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!