
ఆరోగ్యం

‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన తేజ సజ్జ, ప్రస్తుతం ‘మిరాయ్ 2’తో పాటు ‘జోంబీ రెడ్డి 2’ వంటి భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిన ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం బాలీవుడ్ నటి షనయా కపూర్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. చర్చలు విజయవంతమైతే ఇది ఆమె టాలీవుడ్ ఎంట్రీగా నిలిచే అవకాశం ఉంది. మొదటి భాగం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈసారి కథ మాత్రమే అందించనున్నారని, కొత్త దర్శకుడు ప్రాజెక్ట్ను తీసుకోనున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!