

మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవల అఖిల్తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడిన భాగ్యశ్రీ, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఒత్తిడికి గురికావడం కంటే చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించింది.
తెలుగు సినీ పరిశ్రమలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని, భవిష్యత్తులో రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులతో పని చేయాలని తన కోరికను వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటూ తెలుగు సంస్కృతి, ఆహారాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఇటీవల తన సంపాదనతో తల్లికి మొబైల్ ఫోన్ కొనిచ్చానని, తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు చేసినా అది విలువైనదేనని భావిస్తున్నానని భావోద్వేగంగా వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!