

తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ విడుదల సమయంలో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ హీరో కథాంశాన్ని భారతీయ భావజాలంతో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. అదే సినిమాను తాజాగా త్రీడీ రూపంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా.. ఈసారి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించలేదనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. మొదటి విడుదల సమయంలో కనిపించిన ఉత్సాహం రీరిలీజ్లో మాత్రం కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో పరిమిత ప్రదర్శనలతో విడుదలైన ఈ త్రీడీ వెర్షన్కు బుకింగ్స్ పెద్దగా నమోదు కాలేదని సమాచారం. ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వసూళ్లు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతాన్ని అందించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమా తొలి విడుదలలో ఘన విజయాన్ని అందుకున్నప్పటికీ.. రీరిలీజ్ మాత్రం అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!