

‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో కథానాయికగా నటిస్తున్న ఆమె, ఓ ఇంటర్వ్యూలో అందం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాన్ఫిడెన్స్, గ్లామర్, ఆకర్షణలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అడగగా.. ఆత్మవిశ్వాసమే అసలైన అందమని త్రిప్తి తెలిపారు. తనపై తనకు పూర్తి నమ్మకం ఏర్పడితే మిగిలిన అంశాలన్నీ సహజంగానే వస్తాయని చెప్పారు.
వయసు పెరుగుతున్న కొద్దీ అందంపై తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని త్రిప్తి వెల్లడించారు. చిన్నతనంలో బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదాన్నని, ఇప్పుడు మాత్రం నిజమైన ఆకర్షణ అంటే ఆత్మవిశ్వాసం, స్వయం గౌరవం, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. ఇతరులతో అనుబంధం ఏర్పరచుకునే ముందు మనతో మనం అనుసంధానం కావడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. బయటికి వెళ్లే ముందు తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తానని త్రిప్తి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!