

టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలతో కలిసి విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా హీరో నానిపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాని నటించిన ‘నిన్ను కోరి’ తనకు ఎంతో ఇష్టమైన చిత్రమని తెలిపింది. ముఖ్యంగా ఆ సినిమాలో నాని నటన సహజత్వం, భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిందని, ఆయన నటన తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొంది.
ఇప్పటివరకు పూజా హెగ్డే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలతో నటించినప్పటికీ, నానితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో ఆమె చేసిన ప్రశంసలు ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్పై ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తుండగా, త్వరలో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. మరోవైపు పూజా హెగ్డే కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉండి, మరో విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!