

టాలీవుడ్లో ఇటీవల పెరుగుతున్న ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్ల సంస్కృతిపై ‘భద్రకాళి పిక్చర్స్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తీవ్రంగా స్పందించారు. సినిమాకు వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువగా కలెక్షన్లు ప్రచారం చేసుకోవడం వల్ల ప్రొడక్షన్ సంస్థకు తక్షణంగా పెద్దగా నష్టం లేకపోవచ్చని, కానీ ఆ సినిమాకు పనిచేసిన హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల మార్కెట్పై మాత్రం దీర్ఘకాల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు లెక్కలతో మార్కెట్ను మభ్యపెట్టడం సరైన విధానం కాదన్నారు.
ఎన్ని తప్పుడు నంబర్లు చెప్పి సినిమాకు హైప్ తీసుకువచ్చినా, అసలైన థియేట్రికల్ ఫిగర్ మాత్రం ఎప్పటికీ నిజమైన కొలమానంగా ఉంటుందని ప్రణయ్ రెడ్డి వంగా అన్నారు. ఇటీవలి కాలంలో పలు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ముందుగా నిర్ణయించిన బడ్జెట్ పరిమితులను దాటి నిర్మాణ వ్యయం పెంచడమేనని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో పారదర్శకత, వాస్తవాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!