
రాజకీయాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ తర్వాత తొలి రోజే ఇంట్లో హైడ్రామా మొదలైంది. కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే నామినేషన్స్, ప్రధాన టాస్క్లు ప్రారంభం కాకముందే ఒకరిపై ఒకరు అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ గొడవలకు దిగారు.
తొలి ఎపిసోడ్లో టాలీవుడ్ నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయుడు మధ్య జరిగిన వాడీవేడి వాగ్వాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రారంభం నుంచే త్రిగుణ్ ప్రతి విషయంలో రోహిత్ను టార్గెట్ చేస్తున్నాడనే చర్చ కూడా ప్రేక్షకుల్లో మొదలైంది.
ఇదిలా ఉండగా, కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కీలక హెచ్చరిక చేశారు. తామింకా పూర్తిస్థాయి హౌస్మేట్స్ కాలేదని, వచ్చే వారం చాలా మంది ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఆట మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!