

కొత్త దర్శకులకు అవకాశం కల్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందని అక్కినేని నాగార్జున ప్రకటించారు. మంచి, కొత్త కథతో ఎవరైనా ముందుకు వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ను సంప్రదించవచ్చని తెలిపారు. పళ్ళ బురుసు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున ఈ సందర్భంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించామని, ఇకపై మరింత వేగంగా కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాగార్జున చెప్పారు. స్టూడియోను లీజుకు ఇచ్చి డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమకు తిరిగి ఏదైనా అందించాలనే ఉద్దేశంతో సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల లెనిన్తో విజయాన్ని అందుకున్నామని, ఇప్పుడు పళ్ళ బురుసు విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!