
గాసిప్స్

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారిగా కలిసి నటిస్తున్న ‘ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్న ఈ నేచురల్ థ్రిల్లర్ను ఏక్తా కపూర్, శోభా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్తో సినిమా ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రిలీజ్ డేట్ పోస్టర్లో ఒకవైపు పులి, మరోవైపు ఆవు, మధ్యలో త్రిశూలం పట్టుకున్న వ్యక్తి కనిపించడం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ప్రకృతి, మనిషి మధ్య జరిగే విభిన్నమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!