

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టి పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 20 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుండగా, మొత్తం డీఏ 38 శాతానికి చేరనుంది. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం దశలవారీగా లక్ష ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. అందులో మూడో వంతు ఉద్యోగాలను మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపింది. అన్నపూర్ణ యోజనకు ₹36,000 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కోసం ₹550 కోట్లు కేటాయించింది. రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు ₹5,000, రాజకీయ కారణాలతో జైలు జీవితం గడిపిన వారికి ₹10,000 పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే స్థానిక అభివృద్ధి నిధిని ₹70 లక్షల నుంచి ₹1 కోట్లకు పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!