
షోస్

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తన వివరణను పది రోజుల్లోగా సమర్పించాలని కమిటీ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎథిక్స్ కమిటీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి ఇచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఆయన సమర్పించే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డికి జారీ చేసిన నోటీసులు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!