
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కన్నుమూశారు. విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలుపొందారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని.. తాజాగా టీడీపీలో చేరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!