

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని, అవి ‘బ్లాక్బస్టర్’గా నిలిచాయని అన్నారు. బెంగళూరులో మంగళవారం మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా చేసిన ఓ హామీని ప్రస్తావిస్తూ, ఆయన కూడా కాంగ్రెస్ హామీలను కాపీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు.
నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభ, సెనెట్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ప్రతి వయోజన అమెరికన్కు 5,000 డాలర్ల ‘డివిడెండ్’ అందిస్తామని ట్రంప్ ప్రతిపాదించినట్లు శివకుమార్ తెలిపారు. ఐర్లాండ్లో గత ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా ప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం సమీకరిస్తున్నందున ఈ చెల్లింపు సాధ్యమేనని చెప్పారు. అంతకుముందు డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలోనూ ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శివకుమార్ కాంగ్రెస్ హామీలను ట్రంప్ అనుసరిస్తున్నారని అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!