
సినిమాలు

మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మీడియా ప్రతినిధులు కలవగా, ప్రస్తుతం వరలక్ష్మి పూజ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని ఆమె తెలిపారు. నిన్ననే అన్ని విషయాలపై మాట్లాడానని, చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వెల్లడించానని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై తాను మరేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై మాట్లాడతానని కొండా సురేఖ తెలిపారు. అప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, త్వరలోనే అన్ని విషయాలపై తప్పకుండా స్పందిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, సుష్మిత తన కుమార్తె అని మంత్రి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!