

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 13తో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య కీలక బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు-2026పై చర్చ ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్కు సంబంధించిన ప్రతిపాదిత బిల్లులపైనా అనిశ్చితి నెలకొంది.
మిగిలిన కొద్ది రోజుల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, పార్లమెంట్లో తమ వ్యూహాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు ఎంపీలకు విప్ జారీ చేశాయి. సమావేశాలు ముగిసే వరకు ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించాయి. అయితే సోమవారం లోక్సభ అధికారిక ఎజెండాలో ఎఫ్సీఆర్ఏ సవరణ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి కీలక అంశాలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!