

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థతో పాటు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పించింది. భారతి సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్ వికాట్ వంటి బహుళజాతి సంస్థలను బెదిరిస్తూ వాటి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. అలాగే మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది.
అదేవిధంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాదిగా ప్రజలు హాజరవుతున్న కార్యక్రమాల్లో కూడా జగన్కు తగిన పోలీసు రక్షణ కల్పించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. తమ వినతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్సార్సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!