

బిగ్బాస్ తెలుగు 10లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్హాట్గా సాగినట్లు తెలుస్తోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్లకు ఎక్కువ నామినేషన్స్ పడగా.. సొంత టీమ్ నుంచే తనపై పలు నామినేషన్స్ రావడం త్రిగుణ్ను షాక్కు గురిచేసినట్లు కనిపించింది. టాస్కులో గెలిచి నరేశ్ నామినేషన్స్ ప్రక్రియకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా చైత్ర విషయంలో గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ త్రిగుణ్ను నామినేట్ చేశాడు. దీనికి స్పందించిన త్రిగుణ్.. సుధీర్తో శ్రిష్టి గురించి తాను మాట్లాడిన సందర్భాన్ని వివరిస్తూ, తన మాటల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. తనను నేరుగా ఎదుర్కొంటే అంగీకరిస్తానని, కానీ వెన్నుపోటు మాత్రం తట్టుకోలేనంటూ వ్యాఖ్యానించాడు.
మరోవైపు ఆలస్యంగా రావడంపై నరేశ్ చేసిన వ్యాఖ్యలపై షాలినీ స్పందిస్తూ.. రామ్ ప్రసాద్ నిద్రపోయినప్పుడు ఎన్ని సార్లు కుక్కలు మొరిగాయంటూ ప్రశ్నించింది. దీనిపై నరేశ్ కూడా అమన్ విషయంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదని కౌంటర్ ఇచ్చాడు. నామినేషన్ పాయింట్ల సమయంలో కొందరు చప్పట్లు కొడుతూ ఒకరికి మద్దతు ఇస్తున్నారని, హౌస్లో ఫేవరిటిజం నడుస్తోందని షాలినీ ఆరోపించింది. త్రిగుణ్ మాత్రం హౌస్లో ఉన్న గ్రూపులను బ్రేక్ చేసేందుకు తన వ్యూహాలను ఉపయోగిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్, షాలినీ మధ్య వాదనలు జరిగాయి. చివరికి వర్షిణి, షాలినీ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా.. షాలినీ ముందుకు రావడంతో వర్షిణి ఆమెను చేతులతో ఆపే ప్రయత్నం చేసింది. శ్రిష్టి జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లిందో ఎపిసోడ్లో చూడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!