
జనరల్

దేశీయ క్రికెట్లో బీసీసీఐ పలు కీలక నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రస్తుత సీజన్ నుంచే అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, బౌలర్ ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినట్లు తేలితే అతడిని కేవలం ఆ ఇన్నింగ్స్కే కాకుండా మొత్తం మ్యాచ్కు సస్పెండ్ చేయనున్నారు. క్రీడాస్ఫూర్తిని కాపాడడంతో పాటు ఉద్దేశపూర్వక ఉల్లంఘనలను అరికట్టడమే ఈ నిర్ణయం లక్ష్యంగా భావిస్తున్నారు.
మరో కీలక మార్పులో భాగంగా, రోజు ఆటలో చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడినా ఆ ఓవర్ పూర్తయ్యే వరకు ఆట కొనసాగుతుంది. అలాగే డొమెస్టిక్ వన్డే మ్యాచ్లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి కల్పించారు. ఈ నిబంధనలు దేశీయ క్రికెట్ నిర్వహణలో మరింత స్పష్టత, క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా బీసీసీఐ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!