
జనరల్

అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బౌండరీతో శతకం పూర్తి చేసుకున్న గిల్ కేవలం 77 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన గిల్, కెప్టెన్గా తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో తన 21వ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.
మరోవైపు ఇషాన్ కిషన్ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 71 బంతుల్లోనే 103 పరుగులు చేసి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. విశేషంగా, ఒకే ఓవర్లో గిల్, ఇషాన్ ఇద్దరూ తమ సెంచరీలను పూర్తి చేశారు. ఈ అద్భుత భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!