

హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుత ప్రదర్శనతో 41-17 స్కోరుతో ముంబై డ్రీమర్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. టైటిల్తో పాటు రూ.45 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకోగా, రన్నరప్గా నిలిచిన ముంబై డ్రీమర్స్కు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నటుడు చిరంజీవి, ఒలింపియన్ పీవీ సింధు, నటి మృణాళ్ ఠాకూర్, రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ తదితరులు హాజరయ్యారు.

మ్యాచ్ ఆరంభం నుంచే కట్టుదిట్టమైన రక్షణ, వేగవంతమైన దాడులతో హైదరాబాద్ హీరోస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. లభించిన ప్రతి అవకాశాన్ని పాయింట్లుగా మలుచుకుంటూ ముంబైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో బెంగళూరు బ్రేవ్హార్ట్స్ 22-19 తేడాతో చెన్నై బుల్స్ను ఓడించి రూ.15 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. మహిళల విభాగాన్ని విజయవంతంగా ప్రారంభించడం ఈ సీజన్లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!