
గాసిప్స్

సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ఖరారు చేసింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వరుసగా 9వ త్రైమాసికంలోనూ ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, జూలై–సెప్టెంబర్ 2026 కాలానికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. SSY, సీనియర్ సిటిజన్స్ స్కీమ్పై 8.20%, PPFపై 7.10%, కిసాన్ వికాస్ పత్రపై 7.50%, NSCపై 7.70%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్పై 7.40% వడ్డీ కొనసాగుతోంది. పోస్టాఫీస్ డిపాజిట్లు సహా అన్ని చిన్న పొదుపు పథకాల రేట్లు స్థిరంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఊరట లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!