
జనరల్

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కించపరిచేలా ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. వీడియోలో పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లు వేసినట్లు చూపించడం రాజకీయంగా వివాదానికి దారి తీసింది.
టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి కేంద్ర మంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను పోస్టు చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!