
గాసిప్స్

బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబులను చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనున్నారు. దీంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.
ఈ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 మిషన్ల చొప్పున అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!