

భారత అణు రంగంలో తీసుకొచ్చిన ‘శాంతి’ చట్టం భారత్–ఫ్రాన్స్ సహకారాన్ని ప్రభుత్వ స్థాయి నుంచి ప్రైవేట్ కంపెనీలు, ఆధునిక రియాక్టర్ టెక్నాలజీలతో కూడిన విస్తృత పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చనుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. దీంతో భారత అణు పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు.
భారత్–ఫ్రాన్స్ మధ్య 2008లో కుదిరిన పౌర అణు ఒప్పందం ఈ సహకారానికి పునాది వేసింది. జైతాపూర్ అణు ప్రాజెక్ట్ ద్వారా ఎన్టీపీసీఎల్, ఈడీఎఫ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, ఇంధన భద్రత, పరిశోధన, భద్రతా ప్రమాణాలు వంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!