
రాజకీయాలు

భారత్కు చెందిన ఓ తాత ఆస్ట్రేలియాలో ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు. మనవడు అంకిత్తో కలిసి ఆయన ఈ సాహసాన్ని చేశారు. గతంలో 15,000 అడుగుల ఎత్తు నుంచి కూడా స్కైడైవింగ్ చేసిన ఆయన, ఈసారి మరింత ఎత్తు నుంచి దూకి తన ధైర్యాన్ని మరోసారి నిరూపించారు.
విమానం నుంచి దూకే ముందు ‘భయంగా ఉందా?’ అని మనవడు అడగగా, తాత చిరునవ్వుతో “నేను భయపడతానా?” అంటూ ధైర్యంగా సమాధానమిచ్చారు. స్కైడైవింగ్ సమయంలో ఆయన “జై హింద్, జై భారత్, జై హర్యానా” అంటూ నినాదాలు చేయడం వీడియోలో హైలైట్గా నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!