

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, రచయితగా పేరు సంపాదించిన ధనుష్ మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తన పెద్ద కుమారుడు యాత్రను వెండితెరకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించే అవకాశముండటంతో ఆసక్తి మరింత పెరిగింది. అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రాజెక్ట్ చుట్టూ చర్చలు మొదలవడం విశేషంగా మారింది.
ప్రస్తుతం యాత్ర నటన, డ్యాన్స్లలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. తెరపై హీరోగా నిలబెట్టేందుకు ధనుష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. త్వరలో టెస్ట్ షూట్ నిర్వహించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వుండర్బార్ ఫిల్మ్స్, ఆర్కే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, వేల్రాజ్ ఛాయాగ్రహణం నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!