

పాపులర్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణకు సంబంధించిన అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి మరణానికి ముందు తన తల్లి నుదుట బొట్టు, కళ్లకు కాటుక, తలలో పూలతో ఎంతో నిండుగా కనిపించేవారని అనసూయ గుర్తుచేశారు. అయితే మూడేళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత ఆమె ఈ అలంకరణలకు దూరమవ్వడం తనను బాధించిందని చెప్పారు. ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే అమ్మ, అమ్మమ్మలు గాజులు, గోరింటాకు, కాటుక వంటి అలంకరణలను అలవాటు చేస్తారని, అలాంటప్పుడు భర్త మరణించిన తర్వాత వాటిని ఎందుకు తీసేయాలని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!