

‘లెనిన్’ సినిమాతో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రెండో సినిమాతోనే ఆకట్టుకున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్పై ఇప్పుడు ఆసక్తికర ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన మరోసారి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథకు తుది రూపం ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘లెనిన్’ తరహాలో గ్రామీణ నేపథ్యంతో పాటు బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలను మేళవించిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రేక్షకులను మరోసారి కొత్త అనుభూతి కలిగించేలా కథను రూపొందించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి హీరో ఎంపికపై కూడా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రధాన పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ ధనుష్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హీరో ఎంపికతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. ‘లెనిన్’ విజయంతో దర్శకుడిపై నిర్మాతల్లో నమ్మకం పెరగడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!