

భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం షెన్జెన్ అరేనాలో జరిగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రియిన్–టాన్ వీ కియోంగ్ జోడీపై 21-16, 18-21, 21-11 తేడాతో విజయం సాధించింది. దీంతో ‘స్మాష్ బ్రదర్స్’గా పేరొందిన సాత్విక్-చిరాగ్ నాలుగేళ్లలో మూడోసారి ఈ టోర్నీ ఫైనల్కు చేరారు.
తొలి గేమ్లో 0-5తో వెనుకబడిన భారత జోడీ వరుసగా ఏడు పాయింట్లు సాధించి 7-5 ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆధిక్యాన్ని కొనసాగిస్తూ 21-16తో గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో మలేషియా జోడీ 21-18తో గెలిచి మ్యాచ్ను నిర్ణాయక గేమ్కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్లో సాత్విక్-చిరాగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 21-11తో గెలిచారు. గంటా ఆరు నిమిషాల పోరులో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!