

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి విడుదలైన తర్వాత మంచి స్పందనను అందుకుంటోంది. అయితే ఈ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. సమాజానికి మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయులను ప్రతికూలంగా చూపించడం సరికాదని పేర్కొంది. ముఖ్యంగా సినిమాలోని టీచర్ పాత్రను ప్రతికూల కోణంలో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా ఉపాధ్యాయురాలి పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో ప్రభుత్వ పాఠశాల కనిపించడం, విద్యార్థులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న యూనిఫాంలను ధరించడం కూడా అభ్యంతరకరమని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ దృశ్యాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. వెంటనే వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సెన్సార్ బోర్డు, సంబంధిత అధికారులు ఈ అంశంపై స్పందించాలని కోరారు. మరి చిత్రబృందం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!