

విక్టరీ వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కుటుంబ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా విజయానికి వెంకటేష్ ఇచ్చిన ఒక చిన్న సూచన కూడా ముఖ్య కారణమైందని సినీ వర్గాల్లో చెబుతుంటారు. కథ మొత్తం విన్న తర్వాత సెకండాఫ్లో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో సాగుతుండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉందని వెంకటేష్ మేకర్స్కు సూచించినట్లు సమాచారం.
దీంతో చిత్రబృందం కథను మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేసి, మిస్టర్ బీన్ పాత్ర నుంచి ప్రేరణ పొందిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!