

టాలీవుడ్లో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యాక్షన్ సన్నివేశాలను డూప్లపై ఆధారపడకుండా స్వయంగా చిత్రీకరిస్తున్న స్టార్ హీరోలు గాయాల కారణంగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, నటసింహం బాలకృష్ణ తన ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా మోకాలికి గాయపడి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇక ‘పెద్ది’ సినిమా కుస్తీ సన్నివేశాల చిత్రీకరణలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టుకు గాయమవడంతో కోయంబత్తూరులో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజానికి గాయపడటంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్–రామ్ చరణ్, నందమూరి కుటుంబానికి చెందిన బాలకృష్ణ–ఎన్టీఆర్ ఒకే సమయంలో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ గాయాల ప్రభావం ఎక్కువ సినిమాల షూటింగ్లపై ఉండదని, ఎన్బీకే111 విడుదల షెడ్యూల్పై మాత్రం స్వల్ప ప్రభావం ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!