

కొత్తగా తెరిచిన ప్రోటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించాయంటూ బాలీవుడ్ నటి బిపాసా బసు చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. డబ్బా తెరవగానే పౌడర్లో పురుగులు కనిపించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
వినియోగదారులు కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యత, భద్రతపై బిపాసా వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనల అమలుపై అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనల ఉల్లంఘనలపై తుకారాం ముండే చర్యలు తీసుకుంటున్నారని, ఇటీవల షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ప్రోటీన్ పౌడర్లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!