

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు, యువ నిర్మాత ఎస్. నాగవంశీ మధ్య సాన్నిహిత్యం చాలాకాలంగా కొనసాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన పలు చిత్రాల నైజాం పంపిణీ హక్కులను దిల్రాజు దక్కించుకుంటూ వచ్చారు. నాగవంశీ కూడా పలు సందర్భాల్లో దిల్రాజును తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. అయితే ఇటీవల వీరి మధ్య దూరం పెరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగవంశీ తన భవిష్యత్ చిత్రాలను ఇతర పంపిణీదారుల సహకారంతో విడుదల చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనికి అసలు కారణం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
ఇదిలా ఉండగా, విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై దిల్రాజు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కుల కోసం త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణలను కలిసి ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్ర హక్కులపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. గత అనుబంధం నేపథ్యంలో నైజాం హక్కులు మళ్లీ దిల్రాజుకే దక్కుతాయా? లేక మరో పంపిణీదారుడి చేతికి వెళ్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!