
క్రీడలు

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారన్న సోషల్ మీడియా రూమర్లకు అధికారికంగా చెక్ పడింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని వచ్చిన ప్రచారం మెగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది.
అయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారిక ట్వీట్ ద్వారా ఈ వార్తలను ఖండించింది. ఆయన సినిమాలు కొనసాగుతాయని, దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే ‘OG 2’పై చర్చలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా తన షెడ్యూల్ను ప్రకటిస్తారని తెలిపింది. దీంతో ఆయన సినిమాలకు గుడ్బై చెబుతున్నారన్న వార్తలు తప్పని తేలిపోయింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!