

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంతో భారతీయ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్లో విడుదల కానుంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ప్రియాంక, గత 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాగే అద్భుతమైన టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని ప్రియాంక తెలిపారు. రాజమౌళి సృష్టించే ప్రపంచం ఎంతో విభిన్నంగా, లార్జర్ దాన్ లైఫ్గా ఉంటుందని ప్రశంసించారు. సినిమాలో పలు క్లిష్టమైన స్లో-మోషన్ జంప్ సన్నివేశాల్లో నటించినట్లు, అంటార్కిటికా వంటి అరుదైన ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరించిన పాట అద్భుతంగా వచ్చిందని, మిగిలిన షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!