

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) రోజుల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తేదీలతో పాటు మార్పులపై చర్చించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొంతమంది మంత్రులను తప్పించే అవకాశం ఉందని ప్రచారం ఉంది.
జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా కేబినెట్కు కొత్త రక్తం తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మాజీ RBI గవర్నర్ శక్తికాంత దాస్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆర్థిక శాఖ నుంచి విద్యా శాఖకు మారుస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!