

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండీ నర్సింహారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో సహకరించే వారికి టీడీఆర్ లేదా తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని నిర్ణయించారు. అలాగే, నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్' ఏర్పాటు చేసి, ప్రాజెక్టు వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా స్వీకరించాలని అధికారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!