
క్రీడలు

వ్యాపారవేత్తగా కొనసాగుతున్న పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళలో పర్యటించారు. ‘స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్’ను ప్రారంభించేందుకు కేరళకు వచ్చిన ఆమె ముఖ్యమంత్రి సతీశన్ను కలిశారు. ఈ సందర్భంగా కేరళలో ఫుట్బాల్కు ఉన్న ఆదరణ, రొనాల్డోకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సతీశన్ ఆమెతో మాట్లాడారు.
మలయాళీలకు తన సోదరుడిపై ఉన్న అభిమానాన్ని తెలుసుకున్న ఎల్మా అవీరో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేరళలో రొనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తన సోదరుడికి తెలియజేస్తానని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సతీశన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!