
జనరల్

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో కీలక అడుగు వేయనుంది. జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ను భారత్లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా దేశంలో జావెలిన్ క్షిపణుల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్కు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్లో అధునాతన క్షిపణుల తయారీ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి ఈ భాగస్వామ్యం ప్రోత్సాహం అందించడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి క్షిపణుల సరఫరాను వేగవంతం చేసేందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అమెరికాతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!