

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందున్న స్థాయికి చేరుతూ గురువారం ఉదయం బ్యారెల్కు 72.28 డాలర్లకు పడిపోయింది, ఇది గత సెషన్తో పోలిస్తే 4 శాతం తగ్గుదల. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 1.69 శాతం తగ్గి బ్యారెల్కు 69.15 డాలర్లకు చేరి 70 డాలర్ల దిగువకు చేరింది. గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధి ద్వారా సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది. యుద్ధం తగ్గడం, ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలించే అవకాశాలు ఉండటం వల్ల ధరలు తగ్గుతున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బంగారం ఔన్సుకు 3996 డాలర్లకు, వెండి 57.35 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1.44 లక్షలు, వెండి కిలోకు రూ.2.22 లక్షలకు చేరాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1.41 లక్షలు, వెండి ఫ్యూచర్స్ రూ.2.13 లక్షలుగా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు పెరిగి 77,502 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 24,172 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 22 పైసలు బలపడి 94.33 వద్ద ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!