
జనరల్

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఎనిమిది ఏసీబీ బృందాలు ఏకకాలంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో హైటెక్ సిటీలోని మీనాక్షి స్కైట్ టవర్స్లో ఉన్న వెంకటరమణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం తనిఖీల్లో కీలక ఆస్తి పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తైన అనంతరం పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!