

పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కఠిన శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో వ్యంగ్యంగా స్పందించారు. “భయపడిపోయాడు... భయం స్పష్టంగా కనిపిస్తోంది...నా దేశ యువతకు ధన్యవాదాలు". అంటూ పోస్ట్ చేస్తూ, ప్రజల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇటీవల నీట్ సహా పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో అరెస్టులు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలను ప్రకటించింది. పేపర్ లీక్ నేరస్థులకు కఠిన శిక్షలు, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!