

పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన యువ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బిజీగా మారుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి రావడంతో భర్త నాగచైతన్యను నెలకు ఒకసారి మాత్రమే కలిసేదానినని తెలిపింది.
తామిద్దరూ సినీ రంగంలోనే ఉండటంతో పెళ్లి తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా అనిపించిందని శోభిత చెప్పింది. అయితే కొన్ని నెలల్లోనే కొత్త జీవితానికి అలవాటు పడి, తమ వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నామని తెలిపింది. చిన్నతనం నుంచి తన పెళ్లిపై ఎన్నో కలలు ఉండేవని, పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలని కోరుకునేదానినని చెప్పింది. అయితే మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, ముఖ్యంగా ఓ హీరోను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని, తన జీవితంలో చైతన్య రావడం అదృష్టంగా భావిస్తున్నానని శోభిత ఆనందం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!