
సినిమాలు

కోలీవుడ్లో బ్లాక్బస్టర్ దర్శకుడిగా గుర్తింపు పొందిన లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం హీరోగా డీసీ సినిమాలో నటిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు విశాల్ వెంకట్ రూపొందించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఆయన నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించనున్నారు.
స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. దర్శకుడిగా, హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ముద్ర వేయడానికి లోకేశ్ సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెజీనా కెరీర్కు మరో కీలక అవకాశంగా భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!